ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది...
- August 02, 2016
మహారాష్ట్రలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మహారాష్ట్ర మహద్ వద్ద ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది. ప్రమాద సమయంలో వంతెనపై వెళుతున్న రెండు బస్సులు కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలిలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ముంబయి-గోవా రహదారిపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. సావిత్రినదిపై కూలిన వంతెన బ్రిటీష్ కాలం నాటిదని అధికారులు తెలిపారు. పురాతన వంతెన పక్కనే మరో కొత్త వంతెన కూడా ఉంది. కొత్త వంతెనపై నుంచి వెళ్లకుండా రెండు బస్సులు పురాతన వంతెనపైకి ఎందుకెళ్లాయని అధికారులు ఆరాతీస్తున్నారు. ముంబయి నుంచి ప్రత్యేక అధికారుల బృదం ఘటనాస్థలికి బయలుదేరింది. రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







