ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- March 21, 2026
హైదరాబాద్: ప్రపంచ మౌఖిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక దంత ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
“Smile Brighter This Summer” అనే థీమ్తో కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక డెంటల్ ప్యాకేజీలు, అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం ఉచిత దంత పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటి నభా నటేష్, ప్రముఖ నటుడు రాజా రవీంద్రతో పాటు డా.ఎ.శరత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పి.హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రారంభించిన సీనియర్ సిటిజన్స్ కోసం ఏప్రిల్ 15, 2026 వరకు ఉచిత డెంటల్ చెకప్ సౌకర్యాన్ని ప్రకటించారు.
అదేవిధంగా సమ్మర్ స్పెషల్ ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజ్లో కుటుంబ సభ్యులకు డెంటల్ కన్సల్టేషన్, డిజిటల్ OPG ఎక్స్-రే సౌకర్యం, అలాగే అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్పై 30 శాతం తగ్గింపు అందిస్తున్నారు.
ఈ ప్యాకేజ్ను ప్రత్యేక రాయితీ ధర రూ.1999/-కు అందుబాటులో ఉంచారు.ఈ ఆఫర్ జూన్ 30, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
ఈ సందర్భంగా వైద్య నిపుణులు డా. సి. శరత్ బాబు, ప్రోస్థోడాంటిస్ట్ & ఇంప్లాంటాలజిస్ట్ మాట్లాడుతు, నోటి ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకమని, పళ్ళు మరియు దంతాల సంరక్షణ ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో సరైన మౌఖిక పరిశుభ్రత పాటించడం అత్యంత అవసరమని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహేష్ డెగ్లూర్కర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మెడికవర్ హాస్పిటల్స్ మరియు వైద్య నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







