ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!
- August 11, 2026
మస్కట్: ఒమన్లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వేలాది మంది ప్రవాస కార్మికులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2026 తొలి ఆరు నెలల్లో 11,172 మంది నాన్-ఒమానీ కార్మికులు కార్మిక నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించగా.. వారిలో 2,944 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2026 జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన ఫలితాలను మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో విడుదల చేసింది. కార్మిక మార్కెట్ను క్రమబద్ధీకరించడం, నిబంధనల అమలును బలోపేతం చేయడం, కార్మికులు, యజమానుల హక్కులను పరిరక్షించడంలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపింది.
6,707 తనిఖీలు
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అధికారులు మొత్తం 6,707 తనిఖీలు నిర్వహించారు. వీటిలో 69.5 శాతం నిబంధనల అమలు నమోదైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలకు సంబంధించి 4,680 కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారు. అలాగే సెటిల్మెంట్ నిర్ణయాల ఆధారంగా 272 ఉద్యోగ అవకాశాలను నమోదు చేశారు.
అవసరమైన అనుమతులు లేకుండా పనిచేయడం, అధికారికంగా ఆమోదించిన ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం వంటి ఉల్లంఘనలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. నాన్-ఒమానీ కార్మికులు, యజమానులు కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అవసరమైన సందర్భాల్లో కేసులను సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!
- భారత్-యూఏఈ ప్రయాణికులకు అలర్ట్..!!
- పౌరుల సంక్షేమమే కేంద్రంగా భారత దౌత్య విధానం
- రెడీ ఫర్ స్కూల్.. QNLలో ప్రత్యేక వర్క్షాపులు..!!
- 700 కిలోల వైర్ల చోరీ.. ముగ్గురు ఆసియన్లకు ఐదేళ్ల జైలు..!!
- సిరంజీలు, వైల్స్ తరహా ప్యాకేజింగ్లో కాస్మెటిక్స్.. సౌదీలో నిషేధం..!!
- 100 కోట్ల రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం ఆమోదం!
- 2028 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ విహంగాలు: మంత్రి రామ్మోహన్ నాయుడు
- కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లును లోక్సభ ఆమోదం







