యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- March 21, 2026
యూఏఈ: యూఏఈలో అల్పపీడన వ్యవస్థ కారణంగా మార్చి 27 వరకు అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. దీని ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదవుతోందన్నారు.
రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య దుమ్ము, ఇసుకను లేపే బలమైన గాలుల కారణంగా హారిజెంట్ విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, NCM ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలను చూపిస్తున్న వీడియోలు ఆన్లైన్లో పోస్ట్ చేసింది.
దుబాయ్ లో..
దుబాయ్ లో వర్షం దంచికొడుతోంది. వీధులు, రహదారులు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. దిబ్బా, ఫుజైరా మరియు తూర్పు ప్రాంతాలపై భారీ వర్షాలు కురుస్తున్నాయి. షార్జాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ ఆహ్లాదకరమైన వర్షంలో ప్రజలు తిరుగుతూ, పవిత్రమైన ఈద్ పండుగను జరుపుకుంటున్నారు.
NCM ప్రకారం, యూఏఈ వ్యాప్తంగా నివాసితులు ఒక వారం పాటు అస్థిర వాతావరణాన్ని ఎదుర్కోనున్నారు. కొన్ని ప్రాంతాలలో వర్షం, ఉరుములతో కూడిన తుఫానులు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అస్థిర వాతావరణ పరిస్థితులలో అప్రమత్తంగా ఉండాలని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని అధికారులు నివాసితులను కోరారు. అస్థిర వాతావరణ పరిస్థితులలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని రోడ్ల రవాణా సంస్థ (RTA) నివాసితులకు సూచించింది.
అబుదాబి లో..
అస్థిర వాతావరణంలో ముందుజాగ్రత్త చర్యగా వేగ పరిమితును తగ్గించినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. అల్ ష్వైబ్ రోడ్డు (అల్ ఖుదార్ వంతెన - అల్ ష్వైబ్ వంతెన)పై గంటకు 100 కిలోమీటర్ల వేగ పరిమితి వ్యవస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నది.
అబుదాబి వ్యాప్తంగా డ్రైవర్లు బయలుదేరే ముందు పరిస్థితులను తనిఖీ చేసుకోవాలని, నీటి వనరులు లేదా లోయల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించాలని మరియు డ్రైవింగ్ విన్యాసాలకు దూరంగా ఉండాలని సూచించారు.
షార్జా పోలీసులు కూడా పలు సూచనలు జారీ చేశారు. సురక్షితమైన వాహన దూరాన్ని పాటించాలని, వేగాన్ని తగ్గించాలని, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని మరియు లోయలు, ఆనకట్టలకు దూరంగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







