యోగా చేస్తున్నారా? ప్రత్యేక ఆహారం ట్రై చెయ్యండి
- July 22, 2015
ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఒక చక్కటి మార్గం. యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు మంచి శరీరసౌష్టవం కూడా మన సొంతమవుతుంది. మన శరీరాన్ని మనం ప్రేమించుకునేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఖచ్చితంగా ఒక భాగం కావాలి. అయితే యోగా చేసేవారు ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ సమయం యోగా చేయడం వల్ల కండరాల నొప్పి బాధిస్తుంటుంది. దీన్ని అధిగమించలంటే రోజూ యోగా చేసి వచ్చిన తర్వాత ఒక అరటిపండును తప్పని సరిగా తీసుకోవాలి. అరటి పండులో పీచుపదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా శరీరానికి శక్తి అందుతుంది. దీనిలోని మెగ్నీషియం, సోడియంలు శరీరంలోని తేమ శాతాన్ని పెంచుతాయి. యోగా చేసేవారు ఖచ్చితంగా ఓట్స్ని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఓట్స్లోని మెగ్నీషియం, పొటాషియంలు కండరాల నొప్పిని తగ్గిస్తాయి. శరీరానికి తగిన పీచునీ అందిస్తాయి. మరొక అల్పాహారం బాదం. ముందురోజు రాత్రి కొన్ని బాదం పప్పులను నీటిలో వేసి నానబెట్టి మరునాటి ఉదయం యోగా చేసేముందు వాటిని తినడం వల్ల శరీరానికి అలసట ఉండదు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు,విటమిన్లూ శరీరానికి తక్షణ శక్తినందిస్తాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







