మిల్క్ రెబ్డి
- July 22, 2015
మిల్క్ రెబ్డి
కావలసిన పదార్ధాలు
పాలు - లీటరు
కుంకుమ పువ్వు - చిటికెడు
పంచదార - ఎనిమిది స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూను
కెవ్డా ఎసెన్స్ - రెండు చుక్కలు
పిస్తా - ఒక స్పూను
తయారు చేసే విధానం
ముందుగా కుంకుమ పువ్వుని కాసిన్ని గోరువెచ్చని పాలల్లో వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలోకి పాలు పోసి సిమ్లో తిప్పుతూ సుమారు ఇరవై నిముషాలు మరిగించాలి. తరువాత ప్రతి ఐదు నిముషాలకోసారి తిప్పుతూ పాలు సుమారు పావు లీటరు అయ్యేవరకూ మరిగించాలి. అప్పటికే పాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి, అప్పుడు స్టవ్ మీద నుంచి దించి పంచదార, పాలల్లో కరిగించిన కుంకుమ పువ్వు, వేసి కలపాలి. చివరిగా కెవ్డా ఎసెన్స్ రెండు చుక్కలు వేసి, పిస్తా పలుకులు చల్లి ఆరాక ఫ్రిజ్లో పెట్టి అందించాలి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







