మిల్క్ రెబ్డి
- July 22, 2015
మిల్క్ రెబ్డి
కావలసిన పదార్ధాలు
పాలు - లీటరు
కుంకుమ పువ్వు - చిటికెడు
పంచదార - ఎనిమిది స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూను
కెవ్డా ఎసెన్స్ - రెండు చుక్కలు
పిస్తా - ఒక స్పూను
తయారు చేసే విధానం
ముందుగా కుంకుమ పువ్వుని కాసిన్ని గోరువెచ్చని పాలల్లో వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలోకి పాలు పోసి సిమ్లో తిప్పుతూ సుమారు ఇరవై నిముషాలు మరిగించాలి. తరువాత ప్రతి ఐదు నిముషాలకోసారి తిప్పుతూ పాలు సుమారు పావు లీటరు అయ్యేవరకూ మరిగించాలి. అప్పటికే పాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి, అప్పుడు స్టవ్ మీద నుంచి దించి పంచదార, పాలల్లో కరిగించిన కుంకుమ పువ్వు, వేసి కలపాలి. చివరిగా కెవ్డా ఎసెన్స్ రెండు చుక్కలు వేసి, పిస్తా పలుకులు చల్లి ఆరాక ఫ్రిజ్లో పెట్టి అందించాలి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









