మిల్క్ రెబ్డి
- July 22, 2015
మిల్క్ రెబ్డి
కావలసిన పదార్ధాలు
పాలు - లీటరు
కుంకుమ పువ్వు - చిటికెడు
పంచదార - ఎనిమిది స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూను
కెవ్డా ఎసెన్స్ - రెండు చుక్కలు
పిస్తా - ఒక స్పూను
తయారు చేసే విధానం
ముందుగా కుంకుమ పువ్వుని కాసిన్ని గోరువెచ్చని పాలల్లో వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలోకి పాలు పోసి సిమ్లో తిప్పుతూ సుమారు ఇరవై నిముషాలు మరిగించాలి. తరువాత ప్రతి ఐదు నిముషాలకోసారి తిప్పుతూ పాలు సుమారు పావు లీటరు అయ్యేవరకూ మరిగించాలి. అప్పటికే పాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి, అప్పుడు స్టవ్ మీద నుంచి దించి పంచదార, పాలల్లో కరిగించిన కుంకుమ పువ్వు, వేసి కలపాలి. చివరిగా కెవ్డా ఎసెన్స్ రెండు చుక్కలు వేసి, పిస్తా పలుకులు చల్లి ఆరాక ఫ్రిజ్లో పెట్టి అందించాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









