శిష్యుల్లో వచ్చిన మార్పు
- July 22, 2015
గంగానదీ తీరంలో విష్ణుశర్మ అనే గురువు ఉండేవాడు. ఆయన సకల విద్యా పారంగతుడు. ఆయన వద్ద వివేకవర్మ, శౌర్యవర్మ, ఆనందవర్మ, కిషోరవర్మ అనే నలుగురు శిష్యులు ఉండేవారు. వారు చాలా వివేకవంతులే. కానీ ఏ పనినీ ఆశక్తితో, ఓర్పుతో చేసేవారు. తొందరగా అలసిపోయి, చిరాకులు పరాకులు పోయేవారు. దాంతో గురువు ఎలాగైనా వారిలో మార్పు తీసుకురావాలని తలంచాడు. ఆశ్రమంలో ఒక చోటు చూపించి అక్కడ బావి తవ్వమని సూచించాడు. తవ్వుతూండగానే.. మధ్యలో మరో మూల చూపించి ఇక్కడ తవ్వండని చెప్పాడు. అక్కడ తవ్వుతుండగా మరోచోల తవ్వమని చెప్పగా.. శిష్యులు చిరాకుతో ఇలా ఒకచోటంటే ఒక చోట అంటూ పోతే ఏ పనీ ఎప్పటికీ పూర్తి కాదు కదా అని గురువుని ప్రశ్నించారు. దానికి గురువుగారు, ఎందుకు పూర్తి కాదు. మీరు మీ విద్యాభ్యాసంలో ఇది కాస్తా అది కాస్తా చదువుతూ సంవత్సరానికి పూర్తి విధ్యనభ్యసిస్తున్నప్పుడు పని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎందుకు పూర్తి కాదు అని బదులిచ్చారు. దాంతో గురువు ఏం చెప్తున్నారనేది వారికి అర్ధం అయ్యి ఆ రోజునుండీ ఏ పనినైనా ఆశక్తిగా, ఓర్పుతో చేయడం అలవాటు చేసుకుని, గురువు గారి అభినందనలు పొందారు. శిష్యుల్లో వచ్చిన మార్పుకు గురువు ఎంతో సంతోషించాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







