శిష్యుల్లో వచ్చిన మార్పు
- July 22, 2015
గంగానదీ తీరంలో విష్ణుశర్మ అనే గురువు ఉండేవాడు. ఆయన సకల విద్యా పారంగతుడు. ఆయన వద్ద వివేకవర్మ, శౌర్యవర్మ, ఆనందవర్మ, కిషోరవర్మ అనే నలుగురు శిష్యులు ఉండేవారు. వారు చాలా వివేకవంతులే. కానీ ఏ పనినీ ఆశక్తితో, ఓర్పుతో చేసేవారు. తొందరగా అలసిపోయి, చిరాకులు పరాకులు పోయేవారు. దాంతో గురువు ఎలాగైనా వారిలో మార్పు తీసుకురావాలని తలంచాడు. ఆశ్రమంలో ఒక చోటు చూపించి అక్కడ బావి తవ్వమని సూచించాడు. తవ్వుతూండగానే.. మధ్యలో మరో మూల చూపించి ఇక్కడ తవ్వండని చెప్పాడు. అక్కడ తవ్వుతుండగా మరోచోల తవ్వమని చెప్పగా.. శిష్యులు చిరాకుతో ఇలా ఒకచోటంటే ఒక చోట అంటూ పోతే ఏ పనీ ఎప్పటికీ పూర్తి కాదు కదా అని గురువుని ప్రశ్నించారు. దానికి గురువుగారు, ఎందుకు పూర్తి కాదు. మీరు మీ విద్యాభ్యాసంలో ఇది కాస్తా అది కాస్తా చదువుతూ సంవత్సరానికి పూర్తి విధ్యనభ్యసిస్తున్నప్పుడు పని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎందుకు పూర్తి కాదు అని బదులిచ్చారు. దాంతో గురువు ఏం చెప్తున్నారనేది వారికి అర్ధం అయ్యి ఆ రోజునుండీ ఏ పనినైనా ఆశక్తిగా, ఓర్పుతో చేయడం అలవాటు చేసుకుని, గురువు గారి అభినందనలు పొందారు. శిష్యుల్లో వచ్చిన మార్పుకు గురువు ఎంతో సంతోషించాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









