అమరావతే రాజధానిగా తీర్మానం..
- March 25, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 28 (శనివారం) న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. గత కొంతకాలంగా సాగుతున్న రాజధాని వివాదానికి ఈ తీర్మానంతో ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన వెంటనే, దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో, ఇదే సమయంలో అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తే, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై ఒక స్పష్టమైన ప్రకటన లేదా చట్ట సవరణ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజధానిగా అమరావతిని ఖరారు చేయడమే కాకుండా, అక్కడ నిలిచిపోయిన నిర్మాణ పనులను వేగవంతం చేయడంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల సమీకరణ మరియు భవిష్యత్తు ప్రణాళికలను ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించవచ్చు.
తాజా వార్తలు
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ









