యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- March 25, 2026
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తుమ్మలపల్లె ప్రాంతంలోని యురేనియం నిల్వల పై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. తాజా పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ఈ అంశం పై ప్రధానమంత్రిని వివరణ ఇవ్వాలని కోరారు.
ఎంపీ బాలశౌరి తన ప్రశ్నల్లో తుమ్మలపల్లెలో అదనంగా 4,400 టన్నుల యురేనియం నిల్వలు లభించాయా?లభించిన యురేనియం నాణ్యత (గ్రేడ్) 0.4 శాతంగా ఉందా? అలాగే అన్వేషణ ఎంత లోతు వరకు జరిగింది, నిల్వల వెలికితీత ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను అడిగారు.
ఈ ప్రశ్నలకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖల సహాయ మంత్రి, అలాగే ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
అణుశక్తి శాఖకు చెందిన అణు ఖనిజాల అన్వేషణ మరియు పరిశోధన డైరెక్టరేట్ (AMD) 2024-25, 2025-26 సంవత్సరాల్లో తుమ్మలపల్లె యురేనియం నిక్షేపాల్లో సుమారు 4,400 టన్నుల ఇన్-సిటు యురేనియం ఆక్సైడ్ వనరును గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
అయితే యురేనియం సగటు నాణ్యత 0.4 శాతం ఉందన్న విషయాన్ని మంత్రి ఖండించారు.
యురేనియం వెలికితీతపై మాట్లాడుతూ, ‘అణు ఖనిజాల రాయితీ నియమాలు, 2016’ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గనుల లీజును మంజూరు చేసిన తర్వాతే తవ్వకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో తుమ్మలపల్లె యురేనియం నిల్వల అభివృద్ధి పై మరింత స్పష్టత ఏర్పడింది.
తాజా వార్తలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్









