రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- March 27, 2026
న్యూ ఢిల్లీ: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్ గా మీట్ కాబోతున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించబోతున్నట్లుగా సమాచారం. అదే విధంగా ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఇది పరీక్షా సమయం అని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమిండియాలా పని చేయాలంటూ పిలుపునిచ్చారు మోదీ. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశానికి సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ప్రధాని, సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్న వివరాలు సీఎస్ లకు వెల్లడించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా క్యాబినెట్ సెక్రటరీ సూచించబోతున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









