భక్తులకు TTD కీలక అలర్ట్..
- March 27, 2026
తిరుమల: తిరుమల భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. తాజాగా ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో టీటీడీ పలు కీలక మార్పులు చేసింది. శుక్రవారం అంటే మార్చి 27 నుంచే ఈ కొత్త రూల్స్ ని టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చిన తర్వాత వీఐనీ బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తుండగానే.. ఆ టికెట్లు అయిపోయినట్లు చూపిస్తోంది. ఈ అంశం పై గత కొన్ని రోజులుగా భక్తులు టీడీటీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చింది.
ఇప్పటి వరకు భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి రూ.10 వేలు విరాళం ఇచ్చాక రూ.500 అదనంగా చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. అయితే విరాళం ఇచ్చి దర్శనం టికెట్ కు రూ.500 చెల్లించేలోపే టికెట్లు అయిపోతున్నాయి. దీంతో విరాళం ఇచ్చిన భక్తులు వీఐపీ దర్శన టికెట్లు బుక్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పై స్పందించిన టీటీడీ టికెట్ బుకింగ్ విషయంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇక నుంచి శ్రీవాణి ట్రస్ట్కు విరాళం ఇచ్చి.. ఆ తర్వాత రూ.500 చెల్లించి వీఐపీ దర్శనం టికెట్ తీసుకోవాలని భావించేవారు.. ఇక పై మొత్తం అంటే విరాళం రూ.10 వేలు, టికెట్ కోసం రూ.500 కలిపి మొత్తం ఒకేసారి రూ.10,500 చెల్లించవచ్చు. ఈ కొత్త విధానం వల్ల ట్రస్టుకు విరాళం ఇచ్చిన భక్తులకు వీఐపీ దర్శనం టికెట్లు వెంటనే బుక్ అవుతాయి. టికెట్ కోసం మరోసారి ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మార్పులను అమలు చేసే బాధ్యతను టీటీడీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. దీంతో ఇక పై భక్తులు డెబిట్, యూపీఐ, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ల ద్వారా ఒకేసారి చెల్లింపులు చేయవచ్చు.
ఈ సంవత్సరం జనవరి నుంచి టీటీడీ.. శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తోంది. ప్రతీ రోజు 800 టికెట్లను మాత్రమే జారీ చేస్తోంది. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. కేవలం 1+3 భక్తులకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఐడీ పై ఒకసారి టికెట్ బుక్ చేసుకుంటే.. మళ్లీ వారం రోజుల వరకు ఆ ఐడీ పై టికెట్ బుక్ చేసుకోలేరు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







