రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- March 27, 2026
న్యూ ఢిల్లీ: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్ గా మీట్ కాబోతున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించబోతున్నట్లుగా సమాచారం. అదే విధంగా ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఇది పరీక్షా సమయం అని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమిండియాలా పని చేయాలంటూ పిలుపునిచ్చారు మోదీ. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశానికి సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ప్రధాని, సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్న వివరాలు సీఎస్ లకు వెల్లడించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా క్యాబినెట్ సెక్రటరీ సూచించబోతున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







