రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- March 27, 2026
న్యూ ఢిల్లీ: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్ గా మీట్ కాబోతున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించబోతున్నట్లుగా సమాచారం. అదే విధంగా ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఇది పరీక్షా సమయం అని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమిండియాలా పని చేయాలంటూ పిలుపునిచ్చారు మోదీ. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశానికి సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ప్రధాని, సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్న వివరాలు సీఎస్ లకు వెల్లడించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా క్యాబినెట్ సెక్రటరీ సూచించబోతున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







