ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!

- March 29, 2026 , by Maagulf
ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!

కువైట్ః కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడి అనంతరం, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకులలో చెలరేగిన భారీ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక బృందాలు 58 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించాయి. ఇటీవలి కాలంలో అత్యంత సుదీర్ఘ ఆపరేషన్‌ ఇదని అగ్నిమాపక శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ మరియు అధికారిక ప్రతినిధి అయిన బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ అల్-ఘరీబ్ తెలిపారు. శత్రు డ్రోన్లు దాడి కారణంగా ఇంధన నిల్వ కేంద్రాలలో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు.
అధికారుల ప్రకారం, ఈ ఘటనలో గణనీయమైన నష్టం వాటిల్లినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర సిబ్బంది నిరంతరం సంఘటనా స్థలంలోనే ఉండి, మంటలు మరింతగా వ్యాపించకుండా నిరోధించడానికి మరియు చుట్టుపక్కల సౌకర్యాలను సురక్షితంగా ఉంచడానికి తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com