పెరుగు లేదా మజ్జిగ ఆరోగ్యానికి ఏది మంచిది?

- March 29, 2026 , by Maagulf
పెరుగు లేదా మజ్జిగ ఆరోగ్యానికి ఏది మంచిది?

పాలను పులియబెట్టడం ద్వారా తయారయ్యే పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి, రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. ముఖ్యంగా ఎండకాలంలో వచ్చే నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడే వారు పెరుగును తీసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గడమే కాకుండా జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది.

మజ్జిగతో అసిడిటీ మరియు గ్యాస్ సమస్యలకు చెక్
పెరుగును చిలికి నీళ్లు కలిపి తయారు చేసే మజ్జిగ చాలా తేలికగా ఉంటుంది. ఇందులో అల్లం, జీలకర్ర మరియు పుదీనా కలపడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే మజ్జిగ తాగడం ఉత్తమ మార్గం. ఇది కడుపులో ఆమ్లతను  తగ్గించి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి మజ్జిగ ఒక అమృతం లాంటిది.

ఏ సమయంలో ఏది తీసుకోవాలి?
మీరు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి వీటిని ఎంచుకోవడం మంచిది

  • శక్తి కోసం: మీరు బరువు పెరగాలనుకున్నా లేదా ప్రోటీన్ కావాలనుకున్నా సాదా పెరుగును ఎంచుకోండి.
  • బరువు తగ్గడానికి: తక్కువ కేలరీలు ఉండే మజ్జిగ బరువు తగ్గాలనుకునే వారికి సరైన ఎంపిక.
  • మలబద్ధకం: శరీరంలో నీటి శాతం పెరగడానికి మజ్జిగ సహాయపడుతుంది, తద్వారా మలబద్ధకం తగ్గుతుంది.
  • విరేచనాలు: కడుపు ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు పెరుగన్నం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
  • ఎండ దెబ్బ: వేసవి తాపం నుండి శరీరాన్ని చల్లబరచడానికి పల్చని మజ్జిగను మించిన పానీయం లేదు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com