సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- March 29, 2026
మనామా: ఉమ్రా చేయడానికి మక్కాకు ప్రయాణిస్తున్న బహ్రెయిన్కు చెందిన ఒక యువకుడు నిన్న తెల్లవారుజామున సౌదీ అరేబియాలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో 23 ఏళ్ల ఖలీల్ ఇబ్రహీం అలీ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య బృందాలు ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారి పరిస్థితిని పర్యవేక్షించడానికి మరియు సహాయం అందించడానికి సౌదీ అరేబియాలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం తక్షణ చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
మృతుని మృతదేహాన్ని స్వదేశానికి రప్పించి, బహ్రెయిన్లోని అతని కుటుంబ సభ్యులకు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సౌదీలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









