ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్‌ చర్చలు..!!

- March 29, 2026 , by Maagulf
ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్‌ చర్చలు..!!

జెడ్డా: భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పదేపదే చేస్తున్న దాడులను తమ దేశం ఖండిస్తుందని భారత ప్రధాని పునరుద్ఘాటించారు.

సౌదీ అరేబియా భద్రతకు ముప్పు కలిగించే మరియు దాని సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను భారతదేశం తిరస్కరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా  ప్రాంతీయ పరిణామాలు మరియు కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తత వలన ప్రపంచ భద్రత, స్థిరత్వంపై కలిగే ప్రభావాలను కూడా సమీక్షించారు. అంతర్జాతీయ సముద్ర భద్రత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఇరుపక్షాలు చర్చించాయని క్రౌన్ ప్రిన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com