దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- March 30, 2026
రియాద్ః దమ్మామ్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్ మరియు జుబైల్ కమర్షియల్ పోర్ట్ ద్వారా వచ్చే ఖాళీ కంటైనర్లపై ఫీజు మినహాయింపు కాలాన్ని పొడిగించేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ) ప్రకటించింది. జాతీయ ఎగుమతుల రవాణాకు దోహదపడే విధంగా సౌదీ పోర్టుల పోటీతత్వానికి మద్దతు ఇవ్వడం మరియు లాజిస్టిక్స్ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ కార్యక్రమం రెండు పోర్టులలోనూ వచ్చే ఖాళీ కంటైనర్లపై స్టోరేజీ ఫీజుల నుండి మినహాయింపు కాలాన్ని 10 రోజుల నుండి 20 రోజులకు పొడిగించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది షిప్పింగ్ లైన్లను తూర్పు ప్రావిన్స్లోని పోర్టులకు ఖాళీ కంటైనర్లను దిగుమతి చేసుకోవడానికి మరియు మళ్లించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ చొరవ, గల్ఫ్ ఓడరేవులలో ఉన్న ఖాళీ కంటైనర్లను దమ్మామ్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్ మరియు జుబేల్ కమర్షియల్ పోర్ట్కు మళ్లించడాన్ని ప్రోత్సహించడానికి కూడా దోహదపడుతుందని అథారిటీ తెలిపింది. దీనివల్ల ఎగుమతి కార్యకలాపాలకు అవసరమైన ఖాళీ కంటైనర్ల లభ్యత స్థాయి పెరిగి, ఓడరేవుల ద్వారా వస్తువుల సులభమైన రవాణాకు మద్దతు లభిస్తుందని మవానీ అధ్యక్షుడు సులేమాన్ అల్-మజ్రూవా పేర్కొన్నారు. ఇది సౌదీ ఓడరేవుల పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుందని, ప్రపంచ లాజిస్టిక్స్ కేంద్రంగా సౌదీ స్థానాన్ని పటిష్టం చేయడంలో జాతీయ రవాణా మరియు లాజిస్టిక్స్ వ్యూహం లక్ష్యాలను సాధించడానికి మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







