రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- March 30, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్ లోని సౌదీ మరియు సౌదీయేతర నివాసితులను కవర్ చేసేలా గృహ జనాభా సర్వే కార్యక్రమం ప్రారంభమైనట్లు రియాద్ నగర రాయల్ కమిషన్ (RCRC) ప్రకటించింది. మే 10 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని, జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) సహకారంతో చేపడుతున్నారు. పట్టణ సమాచార డేటాబేస్లను అప్డేట్ చేయడంతోపాటు నగర ప్రణాళిక, అభివృద్ధికి తోడ్పడే నిరంతర ప్రయత్నాలలో ఈ సర్వే ఒక భాగమని పేర్కొన్నది.
జనాభా పెరుగుదలను విశ్లేషించడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, జీవన నాణ్యతను పెంచడం, అభివృద్ధి వ్యూహాలకు సమాచారం అందించడానికి, పట్టణ ప్రణాళికకు మద్దతు ఇవ్వడం ఈ సర్వే లక్ష్యమన్నారు. ఈ సర్వే రియాద్ జనాభా సామాజిక, విద్యా, ఆర్థిక వాస్తవాలను విశ్లేషిస్తుందని తెలిపారు.
ఈ సర్వే 217కు పైగా ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా గణాంక నమూనాను ఉపయోగించి నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సర్వే ఫలితాలు నగరం భవిష్యత్ ప్రణాళికను మెరుగుపరుస్తాయని, 5,960 చదరపు కిలోమీటర్ల అభివృద్ధి జోన్లోని పరిసర ప్రాంతాలు, సేవల స్థాయిలలోని వ్యత్యాసాలను గుర్తించడంలో సహాయపడతాయని కమిషన్ తెలిపింది.
సర్వేలో సేకరించిన డేటా గోప్యత చట్టాల ప్రకారం సురక్షితంగా ఉంటుందని, సౌదీ మరియు సౌదీయేతర కుటుంబాలు తమ సహకారాన్ని అందించాలని కమిషన్ పిలుపునిచ్చింది. అలాగే రాజధాని నగరంలో సేవలను అభివృద్ధి చేయడం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సంబంధించిన నిర్ణయాలకు సేకరించే డేటా మద్దతు ఇస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







