త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- March 31, 2026
కువైట్ః కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి సెంట్రల్ మార్చురీని సందర్శించారు. ఇటీవల ఒక డీశాలినేషన్ కేంద్రంపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒక భారత జాతీయుడి పార్థివ దేహాన్ని అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భారత రాయబారి క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ బ్రిగేడియర్ అబ్దుల్రహీమ్ అల్-అవాధితో సమావేశమయ్యారు. మృతుని కుటుంబంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పార్థివ దేహాన్ని త్వరితగతిన భారత్ కు పంపించేందుకు సంబంధిత కువైట్ అధికారులతో చర్చిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
కువైట్లోని విద్యుత్, జల మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MEW)కు చెందిన నీటి శుద్ధి కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడిలో తమిళనాడుకు చెందిన సంతాన సెల్వం కృష్ణన్ మరణించిన విషయం తెలిసిందే. అతని మరణం కువైట్లోని భారతీయ సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఈ విషాద ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!







