భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- April 06, 2026
మనామాః ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB) తన ఇసా టౌన్ మరియు రిఫా క్యాంపస్లలో ఒక భారీ స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రారంభించింది. సుమారు 4 లక్షల బహ్రెయిన్ దినార్ల బడ్జెట్ అంచనా వ్యయంతో దీనిని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం దాదాపు 11,500 మంది విద్యార్థులకు లెర్నింగ్ ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. జైన్ బిజినెస్ సహకారంతో అమలు చేయబడిన ఈ ప్రాజెక్ట్, 350 క్లాస్ రూములకు అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పించిందని ISB ఛైర్మన్ అడ్వకేట్ బినూ మన్నిల్ వర్గీస్ తెలిపారు. వీటిలో ఇసా టౌన్ క్యాంపస్లో 225, రిఫా క్యాంపస్లో 125 తరగతి గదులతో పాటు అప్టేట్ చేసిన గ్రంథాలయాలు మరియు ప్రయోగశాలలు కూడా ఉన్నాయి. ప్రతి తరగతి గదిలో ఇప్పుడు ఆండ్రాయిడ్ 14.0తో పనిచేసే 86-అంగుళాల హిక్విజన్ 4K ఇంటరాక్టివ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థుల భద్రత కోసం క్యాంపస్ల అంతటా స్మార్ట్ మోషన్ డిటెక్షన్తో కూడిన అధునాతన హిక్విజన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
అలాగే, ఏప్రిల్ నెల రవాణా రుసుముల వసూలును వాయిదా వేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆమోదించిన రవాణా ఒప్పందం, ప్రతి విద్యా సంవత్సరానికి 10 నెలల సేవా కాలాన్ని కలిగి ఉంటుందని మరియు సెప్టెంబర్ 2025 నుండి జూన్ 2029 వరకు పునరుద్ధరించబడిందని చైర్మన్ స్పష్టం చేశారు. పాఠశాలకు ఇంకా సుమారు BD 420,000 బకాయి ఫీజు రావాల్సి ఉందని ఆయన తెలిపారు.
భారత రాయబార కార్యాలయం మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సమన్వయంతో జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) రెండవ సెషన్ ఏప్రిల్ 2న విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలలో గల్ఫ్ టాపర్గా నిలిచిన శ్రేయా మనోజ్ సాధించిన విజయాన్ని ఈ సంస్థ ఘనంగా జరుపుకుంది. బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







