డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- April 06, 2026
కువైట్ః కువైట్ ఆర్థిక మంత్రి యాకూబ్ అల్-రిఫాయ్.. డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయ భవనాన్ని పరిశీలించారు. ఈ దాడిని ఆయన హేయమైన ఇరాన్ దురాక్రమణగా అభివర్ణించారు. తన పర్యటన సందర్భంగా అల్-రిఫాయ్ దాడి వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించారు.వీలైనంత త్వరగా ఆ ప్రాంగణాన్ని పునరుద్ధరించడానికి మరమ్మత్తు మరియు పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యకలాపాలు ఆలస్యం లేకుండా సాధారణ స్థితికి వచ్చేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా అత్యవసర బృందాల వేగవంతమైన స్పందనను మంత్రి అభినందించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అసిల్ అల్-మునిఫీ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







