24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- April 08, 2026
రియాద్: నిబంధనల ఉల్లంఘనలకు గాను జరిమానాలు విధించే ముందే, వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తూ 24,000కు పైగా రవాణా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినట్లు రవాణా సాధారణ అథారిటీ (TGA) తెలిపింది. గత మార్చి నెలలో దేశవ్యాప్తంగా భూమార్గం, సముద్రమార్గం మరియు రైలు రవాణా కార్యకలాపాలపై 434,000కు పైగా తనిఖీలు నిర్వహించిన అనంతరం ఈ మేరకు చర్యలు చేపట్టారు. రవాణా కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలను పెంపొందించడం, అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం , రవాణా రంగంలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా అథారిటీ చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో ఇది ఒక భాగమన్నారు.
అథారిటీ పర్యవేక్షణ గణాంకాల ప్రకారం.. అధికారులు భూ రవాణా రంగంలో 425,874కు పైగా తనిఖీలను, సముద్ర రవాణా రంగంలో 8,268కు పైగా తనిఖీలను నిర్వహించారు. ఈ కార్యకలాపాల్లో రైలు రవాణా రంగానికి చెందిన 77 స్టేషన్ల సందర్శనలు కూడా ఉన్నాయి. భూ రవాణా రంగంలో నిబంధనల పాటించే రేటు (compliance rate) 91 శాతంగా, సముద్ర రవాణా రంగంలో సుమారు 99 శాతంగా, కాగా రైలు రవాణా రంగంలో 100 శాతంగా నమోదైనట్లు TGA వెల్లడించింది.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







