24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- April 08, 2026
రియాద్: నిబంధనల ఉల్లంఘనలకు గాను జరిమానాలు విధించే ముందే, వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తూ 24,000కు పైగా రవాణా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినట్లు రవాణా సాధారణ అథారిటీ (TGA) తెలిపింది. గత మార్చి నెలలో దేశవ్యాప్తంగా భూమార్గం, సముద్రమార్గం మరియు రైలు రవాణా కార్యకలాపాలపై 434,000కు పైగా తనిఖీలు నిర్వహించిన అనంతరం ఈ మేరకు చర్యలు చేపట్టారు. రవాణా కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలను పెంపొందించడం, అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం , రవాణా రంగంలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా అథారిటీ చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో ఇది ఒక భాగమన్నారు.
అథారిటీ పర్యవేక్షణ గణాంకాల ప్రకారం.. అధికారులు భూ రవాణా రంగంలో 425,874కు పైగా తనిఖీలను, సముద్ర రవాణా రంగంలో 8,268కు పైగా తనిఖీలను నిర్వహించారు. ఈ కార్యకలాపాల్లో రైలు రవాణా రంగానికి చెందిన 77 స్టేషన్ల సందర్శనలు కూడా ఉన్నాయి. భూ రవాణా రంగంలో నిబంధనల పాటించే రేటు (compliance rate) 91 శాతంగా, సముద్ర రవాణా రంగంలో సుమారు 99 శాతంగా, కాగా రైలు రవాణా రంగంలో 100 శాతంగా నమోదైనట్లు TGA వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









