24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- April 08, 2026
రియాద్: నిబంధనల ఉల్లంఘనలకు గాను జరిమానాలు విధించే ముందే, వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తూ 24,000కు పైగా రవాణా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినట్లు రవాణా సాధారణ అథారిటీ (TGA) తెలిపింది. గత మార్చి నెలలో దేశవ్యాప్తంగా భూమార్గం, సముద్రమార్గం మరియు రైలు రవాణా కార్యకలాపాలపై 434,000కు పైగా తనిఖీలు నిర్వహించిన అనంతరం ఈ మేరకు చర్యలు చేపట్టారు. రవాణా కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలను పెంపొందించడం, అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం , రవాణా రంగంలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా అథారిటీ చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో ఇది ఒక భాగమన్నారు.
అథారిటీ పర్యవేక్షణ గణాంకాల ప్రకారం.. అధికారులు భూ రవాణా రంగంలో 425,874కు పైగా తనిఖీలను, సముద్ర రవాణా రంగంలో 8,268కు పైగా తనిఖీలను నిర్వహించారు. ఈ కార్యకలాపాల్లో రైలు రవాణా రంగానికి చెందిన 77 స్టేషన్ల సందర్శనలు కూడా ఉన్నాయి. భూ రవాణా రంగంలో నిబంధనల పాటించే రేటు (compliance rate) 91 శాతంగా, సముద్ర రవాణా రంగంలో సుమారు 99 శాతంగా, కాగా రైలు రవాణా రంగంలో 100 శాతంగా నమోదైనట్లు TGA వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









