రాత్రి నేపథ్యంలో మహేష్బాబుపై ఓ పోరాట సన్నివేశo..
- August 04, 2016
మ హేష్బాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. రాత్రి నేపథ్యంలో మహేష్బాబుపై ఓ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటలకు మొదలై... తెల్లవారుఝామున 4 గంటల వరకూ నిరాటంకంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ పోరాట ఘట్టానికి అనల్ అరసు నేతృత్వం వహిస్తున్నారు. ఈ నెల 12 వరకూ ఇక్కడే షూటింగ్ నిర్వహిస్తారు. చెన్నైలోనూ కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే చిత్రమిది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ విడుదల చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









