క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- April 10, 2026
హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతారు. అయితే సమయానికి వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే క్యాన్సర్ను జయించి తిరిగి సాధారణ జీవితాన్ని గడపవచ్చని, అంతేకాకుండా కలలను కూడా నెరవేర్చుకోవచ్చని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీలో చికిత్స పొందిన 40 ఏళ్ల మహిళ నిరూపించారు. స్టేజ్ II బ్రెస్ట్ క్యాన్సర్ను జయించి, ప్రస్తుతం మారథాన్ రన్నర్గా నిలుస్తూ ఇతర క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తిగా మారుతున్నారు.
కొంతకాలం క్రితం ఆమెకు స్టేజ్ II బ్రెస్ట్ క్యాన్సర్ (T1N1aM0) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ (ER/PR+), HER2 నెగటివ్ రకానికి చెందిన క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. వెంటనే మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణుల బృందం మల్టీ-డిసిప్లినరీ విధానంలో చికిత్స ప్రారంభించింది.
మొదట ఆమెకు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ నిర్వహించారు.అనంతరం అడ్జువెంట్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అందించారు.హార్మోన్ సెన్సిటివ్ వ్యాధి కావడంతో, లాంగ్ టర్మ్ హార్మోన్ థెరపీతో పాటు ఓవేరియన్ సప్రెషన్ ఇంజెక్షన్లు కూడా అందించారు. చికిత్స సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా, ఆమె ధైర్యం కోల్పోకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగారు.
చికిత్స పూర్తయిన ఐదేళ్ల తర్వాత కూడా ఆమె పూర్తిగా ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉన్నారు. ముఖ్యంగా, చికిత్స అనంతరం తిరిగి తనకు ఇష్టమైన రన్నింగ్ను ప్రారంభించి, ప్రస్తుతం మారథాన్లలో పాల్గొంటూ స్ఫూర్తిదాయక జీవితం గడుపుతున్నారు. ఆమె పాల్గొనే ప్రతి మారథాన్, క్యాన్సర్పై సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఈ సందర్భంగా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, “బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంతిమ తీర్పు కాదు. సమయానికి వ్యాధిని గుర్తిస్తే, సరైన చికిత్సతో పూర్తిగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రోగి కథ ప్రతి మహిళకు ఆశను ఇస్తుంది. కేవలం వ్యాధిని జయించడమే కాదు, తిరిగి తన కలలను సాధించవచ్చని ఆమె నిరూపించారు. చికిత్స సమయంలో భయం, నిరాశ సహజమే అయినప్పటికీ, కుటుంబ మద్దతు, వైద్యుల పర్యవేక్షణ, రోగి పట్టుదల కలిస్తే క్యాన్సర్పై గెలవడం సాధ్యమే,” అని తెలిపారు.
అలాగే, యువ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, చిన్న వయస్సులోనే లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రొమ్ములో గడ్డ, నొప్పి, ఆకారంలో మార్పులు, చర్మంలో తేడాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు.
ఈ స్ఫూర్తిదాయక కథ, క్యాన్సర్ అనేది జీవితం ముగిసిందనే కాదు.. కొత్త జీవితానికి, కొత్త ఆశలకు ప్రారంభమని గుర్తుచేస్తోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







