శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- April 11, 2026
అమరావతి లో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ వ్యాపారవేత్తలకు వినతి
కొలంబో: సినీ సాంస్కృతిక పర్యాటక రంగాల్లో ఇచ్చిపుచ్చకునే ధోరణిలో ముందుకుసాగాలని, అప్పుడే ఇరుదేశాల సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్టమవుతాయని శ్రీలంక రాజధాని కొలంబో లో పర్యటించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా ప్రతినిధి బృందం అభిప్రాయపడింది.సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా , విజయ్ వర్మ పాకలపాటి లు అక్కడి ప్రజా ప్రతినిధులు, సినీ క్రీడా వ్యాపార ప్రముఖులను కలిసి పలు అంశాలపై చర్చించారు.శ్రీలంక మాజీ అధ్యక్షులు , ప్రధాన మంత్రి మహింద్ర రాజపక్స తనయుడు మాజీ మంత్రి, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు నమల్ రాజపక్స ,కొలంబో మేయర్ వ్రేయిల్ కాలీ బల్తాజార్, క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, శ్రీలంక ఫిల్మ్ కార్పొరేషన్ అధికారులతో ఈ బృందం సమావేశం అయ్యింది. సినిమా రంగానికి సంబంధించి టెక్నాలజీ విషయం లో భారతీయ చలన చిత్ర పరిశ్రమ సహకారం తీసుకోవాలని, అలాగే ఆర్టిస్ట్ ఎక్స్ చేంజ్ జరగాలని, తద్వారా ఇరు దేశాల మార్కెట్ మరింత విస్తృతమవుతుందని , ఇరుదేశాల లొకేషన్ లలో షూటింగ్ లు జరిగేలా ఉభయ దేశాల చిత్ర పరిశ్రమలు చూసుకోవాలని తద్వారా పర్యాటక రంగం ఇరుదేశాలలో అభివృద్ధి చెందడమే కాక సాంస్కృతిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా విజ్ఞప్తి చేశారు. శ్రీలంక లో అగ్ర స్తానం లో వున్న వ్యాపార వేత్తలు విశ్వ రాజధానిగా తీర్చిదిద్దుకుంటున్న అమరావతి లో పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటి కోరారు. ఈ పర్యటనలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య ని కూడా కలవడం , పలు అంశాలను చర్చించడం జరిగిందని బృందం అభిప్రాయపడింది. ఈ సమావేశాలలో లోయ బాలకృష్ణ , అంకిత్ , కార్తీక్ , బృంద తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!









