సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- April 11, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ పాలకుడు, ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో అబుదాబిలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి మరియు ప్రెసిడెన్షియల్ కోర్టు చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా పాల్గొన్నారు. దేశ భద్రత, స్థిరత్వం, సంక్షోభానంతర పరిస్థితుల పై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో దేశవ్యాప్తంగా సైనిక, పౌర సంస్థలు చేపడుతున్న సమన్వయ చర్యలను సమీక్షించారు. ఇటీవల యూఏఈపై జరిగిన ఇరానియన్ దాడుల నేపథ్యంలో దేశ భద్రత, సరిహద్దుల సమగ్రత, ప్రజలు మరియు నివాసితుల రక్షణలో సాయుధ దళాలు, భద్రతా సంస్థలు సమర్థవంతంగా పనిచేశాయని నాయకులు ప్రశంసించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజ ఐక్యత మరియు ప్రభుత్వ సంస్థల సమర్థత వల్లే యూఏఈ ఈ సంక్షోభాన్ని ధైర్యంగా అధిగమించిందని స్పష్టం చేశారు. సవాళ్లను ఎదుర్కొనే శక్తి దేశ సంస్థల్లోనూ, ప్రజల ఏకతాలోనూ ఉందని వారు పేర్కొన్నారు. ఈ పరిణామం దేశం మరింత బలంగా, స్థిరంగా ముందుకు సాగే సామర్థ్యాన్ని మరోసారి నిరూపించిందని తెలిపారు.
దేశంలో శాంతి, భద్రత, అభివృద్ధి నిరంతరం కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సమావేశానికి అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్, దుబాయ్ ఉప పాలకులు, పలు షేక్లు, మంత్రులు మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







