చైనా ప్రీమియర్ లీ చియాంగ్తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ కీలక భేటీ
- April 14, 2026
బీజింగ్: అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు చైనా స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్ లీ చియాంగ్ బీజింగ్లో కీలక సమావేశం నిర్వహించారు. యూఏఈ–చైనా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రాధాన్య రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ఈ సమావేశం ప్రధాన అంశాలుగా నిలిచాయి.
చైనా అధికారిక ఆతిథ్య కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో లీ చియాంగ్, షేక్ ఖాలెద్తో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
షేక్ ఖాలెద్, చైనా అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, యూఏఈ–చైనా మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో తమ దేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా సహకారాన్ని విస్తరించాలని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక బలమైన సంబంధాల పునాది పై మరింత సమగ్ర సహకార దశలోకి అడుగుపెట్టాల్సిన అవసరాన్ని షేక్ ఖాలెద్ నొక్కిచెప్పారు. భవిష్యత్ అవకాశాల్లో పెట్టుబడులు, సరఫరా గొలుసుల బలోపేతం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా ఇరు దేశాల పాత్రను మరింత పెంచే దిశగా చర్చలు జరిగాయి.
వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధి రంగాల్లో అవకాశాలను అన్వేషించేందుకు ఈ పర్యటన సందర్భంగా నిర్వహించిన యూఏఈ–చైనా బిజినెస్ ప్రమోషన్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యతను ఇరువురు ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2025లో ఇరు దేశాల మధ్య చమురుేతర వాణిజ్యం సుమారు 111 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోవడం ద్వైపాక్షిక సంబంధాల బలాన్ని చాటుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శుద్ధ ఇంధనం, పెట్టుబడులు, సుస్థిర వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య శాస్త్రాలు, ఆధునిక సాంకేతికత రంగాల్లో సహకారం పెంపొందించేందుకు పలు అవగాహన ఒప్పందాలపై ఇరువురు నేతల సమక్షంలో సంతకాలు జరిగాయి. జ్ఞాన మార్పిడి, సంయుక్త పరిశోధన కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ శాంతి భద్రత, సవాళ్ల పరిష్కారంలో అంతర్జాతీయ సమన్వయంపై కూడా సమావేశంలో చర్చించారు. అనంతరం చైనా ప్రధాని లీ చియాంగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. ఈ విందు ఇరు దేశాల సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







