దుబాయ్ ఐకానిక్ బుర్జ్ అల్ అరబ్కు 18 నెలల భారీ పునరుద్ధరణ
- April 15, 2026
దుబాయ్: ప్రపంచ లగ్జరీ హాస్పిటాలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న జుమైరా, అలాగే దుబాయ్ హోల్డింగ్ కు చెందిన ఐకానిక్ హోటల్ జుమైరా బుర్జ్ అల్ అరబ్ కు భారీ స్థాయిలో 18 నెలల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా హోటల్ వారసత్వాన్ని రాబోయే తరాలకు సురక్షితంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
1999లో ప్రారంభమైనప్పటి నుంచి ధౌ సేల్ ఆకారంలో ఉన్న బుర్జ్ అల్ అరబ్ దుబాయ్ స్కైలైన్కు ప్రతీకగా, ఆధునిక లగ్జరీకి ప్రపంచ చిహ్నంగా నిలిచింది. వ్యక్తిగత బట్లర్ సేవలను అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టి, లగ్జరీ హోటల్ రంగానికి కొత్త ప్రమాణాలు సృష్టించిన హోటల్గా ఇది గుర్తింపు పొందింది.
సుమారు 25 సంవత్సరాల నిరంతర కార్యకలాపాల తర్వాత, ఈ ప్రతిష్టాత్మక నిర్మాణానికి మొదటిసారిగా సమగ్ర పునరుద్ధరణ చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ను ప్రపంచ ప్రఖ్యాత ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ ట్రిస్టాన్ అవర్ నేతృత్వంలో నిర్వహించనున్నారు. వారసత్వం, నైపుణ్యం, డిజైన్ సౌందర్యాన్ని కాపాడుతూ ఆధునిక స్పర్శను జోడించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
జుమైరా సీఈఓ థామస్ బి.మేయర్ మాట్లాడుతూ, “బుర్జ్ అల్ అరబ్ కేవలం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు, అది దుబాయ్ ఆశయాలకు, నైపుణ్యానికి, శాశ్వతమైన అత్యుత్తమతకు ప్రతీక. ఈ పునరుద్ధరణ ద్వారా దాని వారసత్వాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం” అని తెలిపారు.
ట్రిస్టాన్ అవర్ మాట్లాడుతూ, “ఈ స్థాయి ప్రతిష్టాత్మక ఆస్తికి దుబాయ్లో తొలి పునరుద్ధరణ బాధ్యత రావడం గౌరవకరం. ఈ చారిత్రాత్మక వారసత్వాన్ని అత్యంత అంకితభావంతో ముందుకు తీసుకెళ్లడం ఒక బాధ్యతగా భావిస్తున్నాను” అన్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీసిన నిర్మాణాల్లో ఒకటైన ఈ సేల్ ఆకారపు హోటల్, 198 లగ్జరీ సూట్లు, స్వరోవ్స్కీ క్రిస్టల్స్, మార్బుల్, గోల్డ్ లీఫ్ ఇంటీరియర్స్తో వైభవాన్ని చాటుతోంది.
ట్రావెల్ + లీజర్ సంస్థ ఉత్తర ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలో నంబర్ వన్ సిటీ హోటల్ గా గుర్తించగా, 2023 ఫోర్బ్స్ ట్రావెల్ గైడ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ను కూడా అందుకుంది. బుర్జ్ అల్ అరబ్ ఇప్పటికీ దుబాయ్ కిరీటంలోని అమూల్య రత్నంగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









