ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- April 15, 2026
అబూదాబి: ప్రభుత్వ, ప్రైవేట్ నర్సరీలు, కిండర్గార్టెన్లు మరియు పాఠశాలల్లో నమోదు అయిన పిల్లలు, విద్యార్థులు, బోధనా సిబ్బంది, పరిపాలనా సిబ్బందికి 2026 ఏప్రిల్ 20 సోమవారం నుంచి ప్రత్యక్ష తరగతులు (In-Person Learning) పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.
విద్యాసంస్థలు అవసరమైన సన్నాహక ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భవనాల సిద్ధత, బోధనా మరియు పరిపాలనా సిబ్బందికి శిక్షణ, భద్రతా మరియు రక్షణ విధానాల నవీకరణ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపింది. దీని ద్వారా విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు సురక్షితమైన, నమ్మకమైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొంది.
అదేవిధంగా, అవసరమైతే ప్రైవేట్ పాఠశాలలు హైబ్రిడ్ రోటేషనల్ మోడల్ అమలు చేసుకునే సౌలభ్యం ఉంటుందని, ఇది ఆమోదించిన నిబంధనల ప్రకారం స్థానిక విద్యా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రతి విద్యాసంస్థ సిద్ధతను పరిగణనలోకి తీసుకుని సాఫీగా అమలు చేసేలా చర్యలు ఉంటాయని తెలిపింది.
హైబ్రిడ్ విధానం అమలు చేసే పాఠశాలలు సిబ్బంది విధులను సమర్థవంతంగా కేటాయించాలని, ఒకే ఉపాధ్యాయుడు ఒకేసారి ప్రత్యక్ష మరియు ఆన్లైన్ బోధన నిర్వహించాల్సిన పరిస్థితి లేకుండా చూసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. దీని ద్వారా విద్యా నాణ్యతను కాపాడటంతో పాటు ఉపాధ్యాయుల పనిభారాన్ని సమతుల్యం చేయడం సాధ్యమవుతుందని వివరించింది.
అవసరమైతే విద్యాసంస్థలు ప్రత్యామ్నాయ బోధన విధానాలకు వేగంగా మారేందుకు కూడా సిద్ధంగా ఉంటాయని, విద్య నిరంతరతకు ఎలాంటి అంతరాయం లేకుండా సౌలభ్యంతో ముందుకు సాగుతామని విద్యాశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









