తెలంగాణలో మండుతున్న ఎండలు..ఆరెంజ్ అలర్ట్ జారీ!
- April 16, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న మూడు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భానుడి భగభగలకు తోడు వడగాల్పులు కూడా వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రాకూడదని సూచించారు.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్, మేడ్చల్ వంటి ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉంది. వేడి గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఎక్కువ మొత్తంలో నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో నీడ పట్టున ఉంటూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







