ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!
- April 16, 2026
కువైట్: విద్యా రంగాన్ని క్రమబద్ధీకరించడం, కువైట్ జాతీయులకు ఉపాధి కల్పించడం వంటి ప్రయత్నాలలో భాగంగా ఎనిమిది ప్రత్యేక విభాగాలలో 3,795 మంది కువైటీయేతర ఉపాధ్యాయుల సేవలను క్రమంగా తొలగించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ ఐదేళ్ల ప్రణాళికను రూపొందించింది.
ఈ ప్రణాళిక ప్రకారం 2026–2027 విద్యా సంవత్సరం చివరి నుండి ప్రారంభించి నాలుగేళ్లపాటు ఏటా 766 మంది ఉపాధ్యాయులను, ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో మరో 731 మందిని తొలగిస్తారు. అమలు కాలం ముగిసే నాటికి నిర్దేశిత సబ్జెక్టులలో కువైటీయేతర ఉపాధ్యాయుల సంఖ్యను "సున్నా"కు చేర్చడమే లక్ష్యమని ప్రకటించారు.
ప్రభావిత ప్రత్యేక విభాగాలలో ఇస్లామిక్ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫ్రెంచ్ లాంగ్వేజీ, హోమ్ ఎకనామిక్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, కిండర్ గార్టెన్, సైకాలజీ మరియు సోషల్ స్టడీస్ ఉండగా, వీటిల్లో బోధనా సిబ్బంది అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







