ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!

- April 16, 2026 , by Maagulf
ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!

కువైట్: విద్యా రంగాన్ని క్రమబద్ధీకరించడం, కువైట్ జాతీయులకు ఉపాధి కల్పించడం వంటి ప్రయత్నాలలో భాగంగా ఎనిమిది ప్రత్యేక విభాగాలలో 3,795 మంది కువైటీయేతర ఉపాధ్యాయుల సేవలను క్రమంగా తొలగించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ ఐదేళ్ల ప్రణాళికను రూపొందించింది.

ఈ ప్రణాళిక ప్రకారం 2026–2027 విద్యా సంవత్సరం చివరి నుండి ప్రారంభించి నాలుగేళ్లపాటు ఏటా 766 మంది ఉపాధ్యాయులను, ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో మరో 731 మందిని తొలగిస్తారు. అమలు కాలం ముగిసే నాటికి నిర్దేశిత సబ్జెక్టులలో కువైటీయేతర ఉపాధ్యాయుల సంఖ్యను "సున్నా"కు చేర్చడమే లక్ష్యమని ప్రకటించారు.

ప్రభావిత ప్రత్యేక విభాగాలలో ఇస్లామిక్ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫ్రెంచ్ లాంగ్వేజీ, హోమ్ ఎకనామిక్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, కిండర్ గార్టెన్, సైకాలజీ మరియు సోషల్ స్టడీస్ ఉండగా, వీటిల్లో బోధనా సిబ్బంది అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com