ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!
- April 16, 2026
కువైట్: విద్యా రంగాన్ని క్రమబద్ధీకరించడం, కువైట్ జాతీయులకు ఉపాధి కల్పించడం వంటి ప్రయత్నాలలో భాగంగా ఎనిమిది ప్రత్యేక విభాగాలలో 3,795 మంది కువైటీయేతర ఉపాధ్యాయుల సేవలను క్రమంగా తొలగించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ ఐదేళ్ల ప్రణాళికను రూపొందించింది.
ఈ ప్రణాళిక ప్రకారం 2026–2027 విద్యా సంవత్సరం చివరి నుండి ప్రారంభించి నాలుగేళ్లపాటు ఏటా 766 మంది ఉపాధ్యాయులను, ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో మరో 731 మందిని తొలగిస్తారు. అమలు కాలం ముగిసే నాటికి నిర్దేశిత సబ్జెక్టులలో కువైటీయేతర ఉపాధ్యాయుల సంఖ్యను "సున్నా"కు చేర్చడమే లక్ష్యమని ప్రకటించారు.
ప్రభావిత ప్రత్యేక విభాగాలలో ఇస్లామిక్ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫ్రెంచ్ లాంగ్వేజీ, హోమ్ ఎకనామిక్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, కిండర్ గార్టెన్, సైకాలజీ మరియు సోషల్ స్టడీస్ ఉండగా, వీటిల్లో బోధనా సిబ్బంది అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









