మస్కట్ నుండి ఖసాబ్, బహ్రెయిన్, దుబాయ్, షార్జాలకు ఫ్లైట్స్ రీస్టార్ట్..!!
- April 16, 2026
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమాన కనెక్టివిటీ మళ్ళీ విస్తరిస్తోంది. ఈ ఏప్రిల్లో కీలక ప్రాంతీయ మార్గాలు పునఃప్రారంభమవుతున్నాయి. ఒమన్ ఎయిర్ ఏప్రిల్ 18నుండి ఖసాబ్కు డైరెక్ట్ విమానాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, బహ్రెయిన్ మరియు దుబాయ్లకు కూడా సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, తక్కువ ధరల విమానయాన సంస్థ సలామ్ ఎయిర్.. షార్జాకు డైరెక్ట్ రోజువారీ విమానాలను పునఃప్రారంభించింది. ఈ సర్వీసు ఒమన్ మరియు యూఏఈ మధ్య ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుందని ఎయిర్లైన్ తెలిపింది. మస్కట్ నుండి పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ను పురస్కరించుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయా విమానయాన సంస్థలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









