మస్కట్ నుండి ఖసాబ్, బహ్రెయిన్, దుబాయ్, షార్జాలకు ఫ్లైట్స్ రీస్టార్ట్..!!
- April 16, 2026
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమాన కనెక్టివిటీ మళ్ళీ విస్తరిస్తోంది. ఈ ఏప్రిల్లో కీలక ప్రాంతీయ మార్గాలు పునఃప్రారంభమవుతున్నాయి. ఒమన్ ఎయిర్ ఏప్రిల్ 18నుండి ఖసాబ్కు డైరెక్ట్ విమానాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, బహ్రెయిన్ మరియు దుబాయ్లకు కూడా సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, తక్కువ ధరల విమానయాన సంస్థ సలామ్ ఎయిర్.. షార్జాకు డైరెక్ట్ రోజువారీ విమానాలను పునఃప్రారంభించింది. ఈ సర్వీసు ఒమన్ మరియు యూఏఈ మధ్య ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుందని ఎయిర్లైన్ తెలిపింది. మస్కట్ నుండి పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ను పురస్కరించుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయా విమానయాన సంస్థలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







