ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- April 17, 2026
ఇండోనేషియాలోని పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది.ఒక ప్రైవేట్ హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం ‘మాథ్యూ ఎయిర్ నుసంతారా’కు చెందిన ఎయిర్ బస్ హెచ్-130 (Airbus H-130) హెలికాప్టర్ మెల్వాయ్ ప్రాంతం నుండి బయలుదేరింది. అయితే, ప్రయాణం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో హెలికాప్టర్ సంబంధాలు తెగిపోయాయి. కొండ ప్రాంతంలోని దట్టమైన అడవి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు.
శకలాల గుర్తింపు మరియు స హాయక చర్యలు, హెలికాప్టర్ అదృశ్యమైన వెంటనే రంగంలోకి దిగిన రక్షణ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
టేకాఫ్ పాయింట్ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ తోక భాగాన్ని రక్షణ బృందాలు కనుగొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు (సిబ్బంది) మరియు ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అడవి కావడంతో, పోలీసులు మరియు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఒక ప్రైవేట్ పామ్ ఆయిల్ కంపెనీకి చెందినదిగా అధికారులు నిర్ధారించారు. అయితే, సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేదా ప్రతికూల వాతావరణం కారణమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. విచారణాధికారులు బ్లాక్ బాక్స్ మరియు ఇతర శకలాలను సేకరించే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!









