మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- April 17, 2026
న్యూ ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాభివృద్ధిలో మహిళా శక్తి పాత్రను గుర్తించి, ఆలోచించి ఓటు వేయాలని ప్రధాని ఎంపీలను అభ్యర్థించారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదని, కోట్ల మంది మహిళల ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల సాధన కోసం దేశంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. “మహిళల మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దు. ఈ చారిత్రక ఘట్టం కోసం మనం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మనందరం కలిసి చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది” అని ఆయన ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ హక్కులు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపి నారీ శక్తికి గౌరవం ఇవ్వాలని ఆయన సభను కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









