మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- April 17, 2026
న్యూ ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాభివృద్ధిలో మహిళా శక్తి పాత్రను గుర్తించి, ఆలోచించి ఓటు వేయాలని ప్రధాని ఎంపీలను అభ్యర్థించారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదని, కోట్ల మంది మహిళల ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల సాధన కోసం దేశంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. “మహిళల మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దు. ఈ చారిత్రక ఘట్టం కోసం మనం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మనందరం కలిసి చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది” అని ఆయన ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ హక్కులు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపి నారీ శక్తికి గౌరవం ఇవ్వాలని ఆయన సభను కోరారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు







