మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- April 17, 2026
న్యూ ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాభివృద్ధిలో మహిళా శక్తి పాత్రను గుర్తించి, ఆలోచించి ఓటు వేయాలని ప్రధాని ఎంపీలను అభ్యర్థించారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదని, కోట్ల మంది మహిళల ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల సాధన కోసం దేశంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. “మహిళల మనోభావాలను ఎవరూ దెబ్బతీయవద్దు. ఈ చారిత్రక ఘట్టం కోసం మనం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మనందరం కలిసి చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది” అని ఆయన ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ హక్కులు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపి నారీ శక్తికి గౌరవం ఇవ్వాలని ఆయన సభను కోరారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









