కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- April 17, 2026
అబుదాబిః యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూఏఈకి నూతనంగా నియమితులైన పలువురు రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించి, వారికి స్వాగతం పలికారు. యూఏఈ మరియు వారి సంబంధిత దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు మద్దతునిచ్చే విధంగా సహకారాన్ని బలోపేతం చేయడంలో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వారికి అవసరమైన పూర్తి సహకారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. యూఏఈ దీర్ఘకాలిక విధానం, తమ ప్రజల మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాలను నిర్మించడంపైనే ఆధారపడి ఉందని కూడా ఆయన చెప్పారు.
జింబాబ్వే రాయబారి ఐజాక్ అనానియాస్ మోయో, థాయిలాండ్ రాయబారి బోల్బాంగ్సే వాంగ్ఫేన్, చైనా రాయబారి జెంగ్ జిక్సిన్ లు యూఏఈ ప్రెసిడెండ్ కు క్రెడెన్షియల్స్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ స్పెషల్ అఫైర్స్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ ప్రెసిడెంట్ సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్ సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







