కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- April 17, 2026
అబుదాబిః యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూఏఈకి నూతనంగా నియమితులైన పలువురు రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించి, వారికి స్వాగతం పలికారు. యూఏఈ మరియు వారి సంబంధిత దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు మద్దతునిచ్చే విధంగా సహకారాన్ని బలోపేతం చేయడంలో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వారికి అవసరమైన పూర్తి సహకారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. యూఏఈ దీర్ఘకాలిక విధానం, తమ ప్రజల మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాలను నిర్మించడంపైనే ఆధారపడి ఉందని కూడా ఆయన చెప్పారు.
జింబాబ్వే రాయబారి ఐజాక్ అనానియాస్ మోయో, థాయిలాండ్ రాయబారి బోల్బాంగ్సే వాంగ్ఫేన్, చైనా రాయబారి జెంగ్ జిక్సిన్ లు యూఏఈ ప్రెసిడెండ్ కు క్రెడెన్షియల్స్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ స్పెషల్ అఫైర్స్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ ప్రెసిడెంట్ సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్ సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









