ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- April 19, 2026
మనామా: ఇరాన్ చట్టవిరుద్ధమైన దురాక్రమణ ఫలితంగా కలిగిన అన్ని నష్టాలకు ఇరాన్ నుంచి పూర్తి నష్టపరిహారం ఇప్పించాలని ఐక్యరాజ్యసమితికి బహ్రెయిన్ తన పదకొండవ అధికారిక లేఖలో డిమాండ్ చేసింది.
బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ జరిపిన చట్టవిరుద్ధమైన దాడుల గురించి మండలి సభ్యులకు తెలియజేయడానికి ఉద్దేశించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల పరంపరను కొనసాగించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో బహ్రెయిన్ శాశ్వత మిషన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఈమేరకు భద్రతా మండలి అధ్యక్షుడికి లెటర్ ను సమర్పించారు.
బహ్రెయిన్, గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు మరియు జోర్డాన్పై ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలని నిర్ధారించి, వాటిని తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఇరాన్ పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఫిబ్రవరి 28 నుండి బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు తమ రాజ్యం గగనతలం, ప్రాదేశిక జలాలు మరియు భూభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న 194 బాలిస్టిక్ క్షిపణులను, 523 శత్రు డ్రోన్లను అడ్డుకున్నాయని ఆ ప్రకటనలో వెల్లడించింది. దాడులకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాలని బహ్రెయిన్ డిమాండ్ చేసింది. అలాగే, అంతర్జాతీయ చట్టాలను అమలు చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









