తెలంగాణలో వడగళ్ల వాన
- April 19, 2026
హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగలకు విరామం ఇస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా 44-45 డిగ్రీల ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు అకాల వర్షాలు ఉపశమనాన్ని కలిగించాయి.హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు వడగళ్లు కురిసాయి. అయితే, ఉరుములు, మెరుపులతో పాటు కురిసిన భారీ వడగళ్ల వాన పలు జిల్లాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









