‘పెద్ది’లో సంయుక్త మీనన్ స్పెషల్ సాంగ్!
- April 19, 2026
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హైలైట్ కాబోయే స్పెషల్ సాంగ్ విషయంలో నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది.ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్, మానసా వారణాసి వంటి పేర్లు వినిపించినప్పటికీ, చివరికి సంయుక్త మీనన్ ఖరారైనట్లు సమాచారం.
ఇటీవల అఖండ 2: తాండవంలో “జాజికాయ జాజికాయ” పాటతో మాస్ స్టెప్పులు వేసిన సంయుక్తకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే ఎనర్జీతో రామ్ చరణ్తో కలిసి స్టేజ్ షేక్ చేయనుందన్న టాక్ వినిపిస్తోంది.సంయుక్త ఇప్పటికే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్తో పాటు డ్యాన్స్లోనూ మంచి టాలెంట్ చూపించిన ఆమెకు ఈ స్పెషల్ సాంగ్ మంచి ప్లస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రామ్ చరణ్ ఎనర్జీ, సంయుక్త స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఈ పాట సినిమా హైలైట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి సానా బుచ్చిబాబు దర్శకుడు. ‘ఉప్పెన’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









