జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- April 20, 2026
మనామాం దేశానికి ద్రోహం చేసిన లేదా భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించిన వారిపై అవసరమైన అన్ని చర్యలను తక్షణమే అమలు చేయాలని కింగ్ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా ఆదేశించారు. జాతీయ బాధ్యత మరియు చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
బహ్రెయిన్ పౌరసత్వానికి సంబంధించిన కేసులను సమీక్షించి, దానిని నిలుపుకోవడానికి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు అని నిర్ధారించి, తదనుగుణంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి సున్నితంగా ఉందని, జాతీయ బాధ్యత ఆధారంగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మాతృభూమి నైతికంగా, సామాజికంగా ఒక గొప్ప బాధ్యత మరియు గౌరవమని, దాని భద్రతకు భంగం కలిగించే లేదా దాని విధులను ఉల్లంఘించే చర్యలను ఏమాత్రం సహించవద్దని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







