జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- April 20, 2026
మనామాం దేశానికి ద్రోహం చేసిన లేదా భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించిన వారిపై అవసరమైన అన్ని చర్యలను తక్షణమే అమలు చేయాలని కింగ్ హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా ఆదేశించారు. జాతీయ బాధ్యత మరియు చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
బహ్రెయిన్ పౌరసత్వానికి సంబంధించిన కేసులను సమీక్షించి, దానిని నిలుపుకోవడానికి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు అని నిర్ధారించి, తదనుగుణంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి సున్నితంగా ఉందని, జాతీయ బాధ్యత ఆధారంగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మాతృభూమి నైతికంగా, సామాజికంగా ఒక గొప్ప బాధ్యత మరియు గౌరవమని, దాని భద్రతకు భంగం కలిగించే లేదా దాని విధులను ఉల్లంఘించే చర్యలను ఏమాత్రం సహించవద్దని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









