యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- April 20, 2026
అబూదాబి: యూఏఈ రాష్ట్ర భద్రతా విభాగం దేశ భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నిన ఒక ఉగ్రవాద సంస్థను ఛేదించినట్లు ప్రకటించింది.ఈ సంస్థకు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా, ఈ సంస్థ ఇరాన్కు చెందిన “విలాయత్ అల్-ఫకీహ్” సిద్ధాంతంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది.సభ్యులు తీవ్రవాద భావజాలాన్ని అనుసరించి, దేశీయ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు.
గోప్య సమావేశాల ద్వారా యువతను తప్పుదారి పట్టించడం, విదేశీ శక్తులకు మద్దతు ఇవ్వించేలా ప్రేరేపించడం, దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడం వంటి చర్యలు ఈ సంస్థ చేపట్టినట్లు విచారణలో బయటపడింది. అదనంగా, అనధికార మార్గాల్లో నిధులను సేకరించి విదేశీ అనుమానాస్పద సంస్థలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో సభ్యులపై రహస్య సంస్థ స్థాపన, దేశంలో కార్యకలాపాల నిర్వహణ, విదేశీ సంస్థలకు విధేయత ప్రకటించడం, జాతీయ ఐక్యత మరియు సామాజిక శాంతిని భంగం కలిగించడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి.
దేశ భద్రతను కాపాడడంలో తమ కట్టుబాటును పునరుద్ఘాటించిన రాష్ట్ర భద్రతా విభాగం, అనుమానాస్పద కార్యకలాపాల పై పౌరులు మరియు నివాసితులు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









