ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- April 24, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చర్చల దశలో ఉన్నప్పటికీ, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నౌకలకు విఘాతం కలిగిస్తూ, సముద్రంలో మందుపాతరలు (మైన్లు) వేస్తున్న ఏ ఇరాన్ నౌకనైనా తక్షణమే కాల్చివేయాలని యూఎస్ నేవీని ఆదేశించారు.
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విషయంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని, అమెరికా రక్షణ విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.”హర్మూజ్ జలసంధిలో మైన్లు పెడుతూ మా నౌకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ కు చెందిన ఏ చిన్న పడవనైనా కాల్చి ధ్వంసం చేయాలని నావికాదళాన్ని ఆదేశించాను.”ట్రంప్ పేర్కొన్నారు.
అంతేకాదు ఇరాన్ ప్రస్తుతం తమ నాయకుడు ఎవరో తేల్చుకోలేక ఇబ్బందులు పడుతోందని సెటైర్లు వేశారు. హర్మూజ్పై తాము పూర్తిగా నియంత్రణ సాధించామని పేర్కొన్నారు. అమెరికా నేవీ పర్మిషన్ లేకుండా ఏదైనా నౌక ప్రవేశించడం గానీ.. బయటకు వెళ్లడం లాంటిది ఉండదని తెలిపారు. తమతో ఇరాన్ ఒప్పందానికి వచ్చేవరకు ఇది మూసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









