ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- April 24, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చర్చల దశలో ఉన్నప్పటికీ, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నౌకలకు విఘాతం కలిగిస్తూ, సముద్రంలో మందుపాతరలు (మైన్లు) వేస్తున్న ఏ ఇరాన్ నౌకనైనా తక్షణమే కాల్చివేయాలని యూఎస్ నేవీని ఆదేశించారు.
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విషయంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని, అమెరికా రక్షణ విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.”హర్మూజ్ జలసంధిలో మైన్లు పెడుతూ మా నౌకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ కు చెందిన ఏ చిన్న పడవనైనా కాల్చి ధ్వంసం చేయాలని నావికాదళాన్ని ఆదేశించాను.”ట్రంప్ పేర్కొన్నారు.
అంతేకాదు ఇరాన్ ప్రస్తుతం తమ నాయకుడు ఎవరో తేల్చుకోలేక ఇబ్బందులు పడుతోందని సెటైర్లు వేశారు. హర్మూజ్పై తాము పూర్తిగా నియంత్రణ సాధించామని పేర్కొన్నారు. అమెరికా నేవీ పర్మిషన్ లేకుండా ఏదైనా నౌక ప్రవేశించడం గానీ.. బయటకు వెళ్లడం లాంటిది ఉండదని తెలిపారు. తమతో ఇరాన్ ఒప్పందానికి వచ్చేవరకు ఇది మూసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







