సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- April 24, 2026
ముంబై: ముంబైలోని తన నివాసం వెలుపల అభిమానుల సమక్షంలో సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. గిరిజన ప్రాంత పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్, తన కోసం వేచి ఉన్న అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసారు..
సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆయన నివాసం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చారు.అభిమానులు తీసుకొచ్చిన ప్రత్యేక కేక్ను సచిన్ వారి మధ్యలో కట్ చేశారు. “హ్యాపీ బర్త్డే సచిన్” అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.తన ఇంటి వద్ద వేచి ఉన్న అభిమానులను చూసి సచిన్ బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు.
రెండు రోజుల క్రితమే ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో గిరిజన పిల్లలతో కలిసి సమయం గడిపిన సచిన్, తిరిగి ముంబై చేరుకుని తన నివాసం వద్ద ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అటు సేవా కార్యక్రమాలు, ఇటు అభిమానులతో పలకరింపులతో సచిన్ 53వ పుట్టినరోజు అత్యంత ప్రత్యేకంగా నిలిచింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









