తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!

- April 24, 2026 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!

హైదరాబాద్: తెలంగాణ మంత్రులతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సానుకూలంగా జరిగినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పలు డిమాండ్లకు సర్కార్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే చెప్పింది ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై హైలెవల్ కమిటీ నియమించే అవకాశం ఉంది. సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. మంత్రులతో పాటు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com