ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- April 25, 2026
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2026, మే 9న ఆయన తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా మోదీ తెలంగాణాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ MMTS ఫేజ్ 2 జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు బీబీ నగర్ AIIMS హాస్పిటల్ జాతికి అంకితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితోపాటు తెలంగాణలో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన చేస్తారని.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు.. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారని సమాచారం. అనంతరం జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇదిలా ఉంటే.. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి మోదీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని యూనివర్సిటీకి వెళ్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







