సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- April 26, 2026
యూఏఈః ప్రజలను మోసం చేయడానికి, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించిన ఫేక్ సోషల్ మీడియా అంకౌట్లు, మెసేజులు పెరిగిపోతున్నాయని అబుదాబి పోలీసులు నివాసితులను హెచ్చరించారు.ఇవి కాన్సర్ట్, ఫేక్ వీసాలు, నియామక ఆఫర్లు, ఆకర్షణీయమైన ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడతాయని పోలీసులు వెల్లడించారు. అలాగే, తక్కువ ధరకే వెహికిల్స్ సేల్స్ అంటూ తప్పుదోవపట్టిస్తాయని పేర్కొన్నారు. ఇలా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్ల పేరిట మోసగాళ్లు బాధితులను బురిడీ కొట్టాస్తారని అధికారులు తెలిపారు.
ఇలాంటి ఫేక్ అకౌంట్లు నిజమైనవిగా కనిపించడానికి.. ఫేక్ ఫోటోలు, నమ్మించేలా మెసేజులు, ఆథరాయిజ్డ్ సర్టిఫికేట్ల వంటి అధునాతన ఎత్తుగడలను ఉపయోగిస్తాయని అబుదాబి పోలీసులు పేర్కొన్నారు. ఏదైనా ఆఫర్ ప్రకటన సోర్స్ ను ధృవీకరించుకోవాలని, విశ్వసనీయమైన, అధికారిక వేదికలపైన మాత్రమే లావాదేవీలు జరపాలని అధికారులు నివాసితులను కోరారు. సరైన ధృవీకరణ లేకుండా మనీ ట్రాన్స్ పర్ చేయడం లేదా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోవడం చేయరాదని అధికారులు హెచ్చరించారు.
ఏవైనా అనుమానాస్పద అకౌంట్లు లేదా ప్రకటనల గురించి అమాన్ సర్వీస్ ద్వారా 8002626 నంబర్కు కాల్ చేయడం, 2828 నంబర్కు టెక్స్ట్ మెసేజ్ పంపడం, [email protected] కు ఇమెయిల్ చేయడం లేదా “పోలీస్ స్టేషన్ ఇన్ యువర్ పాకెట్” సేవను ఉపయోగించడం ద్వారా నివేదించాలని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!
- అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!









