సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- April 26, 2026
యూఏఈః ప్రజలను మోసం చేయడానికి, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించిన ఫేక్ సోషల్ మీడియా అంకౌట్లు, మెసేజులు పెరిగిపోతున్నాయని అబుదాబి పోలీసులు నివాసితులను హెచ్చరించారు.ఇవి కాన్సర్ట్, ఫేక్ వీసాలు, నియామక ఆఫర్లు, ఆకర్షణీయమైన ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడతాయని పోలీసులు వెల్లడించారు. అలాగే, తక్కువ ధరకే వెహికిల్స్ సేల్స్ అంటూ తప్పుదోవపట్టిస్తాయని పేర్కొన్నారు. ఇలా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్ల పేరిట మోసగాళ్లు బాధితులను బురిడీ కొట్టాస్తారని అధికారులు తెలిపారు.
ఇలాంటి ఫేక్ అకౌంట్లు నిజమైనవిగా కనిపించడానికి.. ఫేక్ ఫోటోలు, నమ్మించేలా మెసేజులు, ఆథరాయిజ్డ్ సర్టిఫికేట్ల వంటి అధునాతన ఎత్తుగడలను ఉపయోగిస్తాయని అబుదాబి పోలీసులు పేర్కొన్నారు. ఏదైనా ఆఫర్ ప్రకటన సోర్స్ ను ధృవీకరించుకోవాలని, విశ్వసనీయమైన, అధికారిక వేదికలపైన మాత్రమే లావాదేవీలు జరపాలని అధికారులు నివాసితులను కోరారు. సరైన ధృవీకరణ లేకుండా మనీ ట్రాన్స్ పర్ చేయడం లేదా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోవడం చేయరాదని అధికారులు హెచ్చరించారు.
ఏవైనా అనుమానాస్పద అకౌంట్లు లేదా ప్రకటనల గురించి అమాన్ సర్వీస్ ద్వారా 8002626 నంబర్కు కాల్ చేయడం, 2828 నంబర్కు టెక్స్ట్ మెసేజ్ పంపడం, [email protected] కు ఇమెయిల్ చేయడం లేదా “పోలీస్ స్టేషన్ ఇన్ యువర్ పాకెట్” సేవను ఉపయోగించడం ద్వారా నివేదించాలని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







