సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- April 26, 2026
యూఏఈః ప్రజలను మోసం చేయడానికి, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించిన ఫేక్ సోషల్ మీడియా అంకౌట్లు, మెసేజులు పెరిగిపోతున్నాయని అబుదాబి పోలీసులు నివాసితులను హెచ్చరించారు.ఇవి కాన్సర్ట్, ఫేక్ వీసాలు, నియామక ఆఫర్లు, ఆకర్షణీయమైన ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడతాయని పోలీసులు వెల్లడించారు. అలాగే, తక్కువ ధరకే వెహికిల్స్ సేల్స్ అంటూ తప్పుదోవపట్టిస్తాయని పేర్కొన్నారు. ఇలా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్ల పేరిట మోసగాళ్లు బాధితులను బురిడీ కొట్టాస్తారని అధికారులు తెలిపారు.
ఇలాంటి ఫేక్ అకౌంట్లు నిజమైనవిగా కనిపించడానికి.. ఫేక్ ఫోటోలు, నమ్మించేలా మెసేజులు, ఆథరాయిజ్డ్ సర్టిఫికేట్ల వంటి అధునాతన ఎత్తుగడలను ఉపయోగిస్తాయని అబుదాబి పోలీసులు పేర్కొన్నారు. ఏదైనా ఆఫర్ ప్రకటన సోర్స్ ను ధృవీకరించుకోవాలని, విశ్వసనీయమైన, అధికారిక వేదికలపైన మాత్రమే లావాదేవీలు జరపాలని అధికారులు నివాసితులను కోరారు. సరైన ధృవీకరణ లేకుండా మనీ ట్రాన్స్ పర్ చేయడం లేదా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోవడం చేయరాదని అధికారులు హెచ్చరించారు.
ఏవైనా అనుమానాస్పద అకౌంట్లు లేదా ప్రకటనల గురించి అమాన్ సర్వీస్ ద్వారా 8002626 నంబర్కు కాల్ చేయడం, 2828 నంబర్కు టెక్స్ట్ మెసేజ్ పంపడం, [email protected] కు ఇమెయిల్ చేయడం లేదా “పోలీస్ స్టేషన్ ఇన్ యువర్ పాకెట్” సేవను ఉపయోగించడం ద్వారా నివేదించాలని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







