యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- April 26, 2026
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో 50 శాతం పనులను ఏజెంటిక్ ఏఐ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఈ నిర్ణయం డిజిటల్ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.
ఈ సాంకేతికత సాధారణ ఏఐతో పోలిస్తే మరింత ముందుంది. డేటా విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడం, అమలు వంటి ప్రక్రియలను ఒకేసారి నిర్వహించగలదు. వీసాలు, లైసెన్సులు, అనుమతులు వంటి సేవలను వేగంగా పూర్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
ఈ మార్పులతో ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందన్న ఆందోళనల పై యూఏఈ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.ఉద్యోగాలను తగ్గించడం లక్ష్యం కాదని, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచి ఏఐతో కలిసి పనిచేసే విధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది.ఈ నిర్ణయం ప్రపంచ ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







