యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే

- April 26, 2026 , by Maagulf
యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో 50 శాతం పనులను ఏజెంటిక్ ఏఐ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఈ నిర్ణయం డిజిటల్ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.

ఈ సాంకేతికత సాధారణ ఏఐతో పోలిస్తే మరింత ముందుంది. డేటా విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడం, అమలు వంటి ప్రక్రియలను ఒకేసారి నిర్వహించగలదు. వీసాలు, లైసెన్సులు, అనుమతులు వంటి సేవలను వేగంగా పూర్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

ఈ మార్పులతో ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందన్న ఆందోళనల పై యూఏఈ ప్రభుత్వం  స్పష్టతనిచ్చింది.ఉద్యోగాలను తగ్గించడం లక్ష్యం కాదని, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచి ఏఐతో కలిసి పనిచేసే విధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది.ఈ నిర్ణయం ప్రపంచ ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com