యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- April 26, 2026
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో 50 శాతం పనులను ఏజెంటిక్ ఏఐ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఈ నిర్ణయం డిజిటల్ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.
ఈ సాంకేతికత సాధారణ ఏఐతో పోలిస్తే మరింత ముందుంది. డేటా విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడం, అమలు వంటి ప్రక్రియలను ఒకేసారి నిర్వహించగలదు. వీసాలు, లైసెన్సులు, అనుమతులు వంటి సేవలను వేగంగా పూర్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
ఈ మార్పులతో ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందన్న ఆందోళనల పై యూఏఈ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.ఉద్యోగాలను తగ్గించడం లక్ష్యం కాదని, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచి ఏఐతో కలిసి పనిచేసే విధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది.ఈ నిర్ణయం ప్రపంచ ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









