ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- April 27, 2026
ముంబై: ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాత్రి వరకు బంధువులతో కలిసి సంతోషంగా గడిపిన వారు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ముంబైలోని పైధోనీ ప్రాంతంలో నివసించే అబ్దుల్లా డొకాడియా (40), ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనాబ్ (13) తమ బంధువులను రాత్రి విందుకు ఆహ్వానించారు. అందరూ కలిసి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్లిపోయిన తర్వాత, అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి పుచ్చకాయ ముక్కలను తిన్నారు. అయితే, తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఒక్కొక్కరికి తీవ్రమైన వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే జేజే ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ నలుగురూ కన్నుమూశారు.
ఈ మరణాలకు అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారు తిన్న బిర్యానీ వికటించిందా (Food Poisoning) లేక బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తినడం వల్ల ఏవైనా రసాయనిక చర్యలు జరిగాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది. సాధారణంగా బిర్యానీ వంటి భారీ ఆహారం తిన్న వెంటనే పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుందని కొందరు భావిస్తుంటారు. అయితే, బంధువులందరూ బిర్యానీ తిన్నా కేవలం పుచ్చకాయ తిన్న ఈ నలుగురే మరణించడంతో, పుచ్చకాయలో ఏవైనా పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయా లేదా అది పాడైపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘోర కలికలంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం పంపించడంతో పాటు, వారు తిన్న ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. అబ్దుల్లా కుటుంబం ఏ దుకాణం నుంచి బిర్యానీ తెప్పించారు, పుచ్చకాయ ఎక్కడ కొన్నారు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగా లేక మరేదైనా కుట్ర కోణం ఉందా అనేది స్పష్టమవుతుందని అధికారులు వెల్లడించారు. ఒకే కుటుంబం ఇలా అంతమైపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







