వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు

- April 27, 2026 , by Maagulf
వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు తొలి విడతగా రూ.500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారబోతోందని తెలిపారు. నగరంలో గూగుల్ డేటా సెంటర్‌కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com