ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- April 28, 2026
మస్కట్: ఒమన్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ వారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C మార్కును దాటాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో సుర్ మరియు హమ్రా అల్ దురూవా (ఇబ్రి)లో 43°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఫహూద్ (42.8°C), దిమా వత్తాయీన్ (42.4°C), మరియు అల్ ముధైబి (42.3°C) సహా పలు ఇతర ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వారం చివర్లో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°Cకి చేరవచ్చని తెలిపింది. ఎండలు అధికంగా నమోదువుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. తగినంత నీరు తాగాలని, వేడి సంబంధిత అనారోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు, అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) సంభవించవచ్చని డాక్టర్లు హెచ్చరించారు. తగినంత నీరు త్రాగాలని మరియు ఎక్కువసేపు ఎండలో ఉండవద్దన్నారు. వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో అధిక సమయం గడిపితే.. అధిక చెమట, తలనొప్పి, కళ్లు తిరగడం, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, చివరికి స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలకు దారితీయవచ్చని డాక్టర్లు హెచ్చరించారు. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేరాలని సూచించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







