ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- April 28, 2026
మస్కట్: ఒమన్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ వారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C మార్కును దాటాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో సుర్ మరియు హమ్రా అల్ దురూవా (ఇబ్రి)లో 43°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఫహూద్ (42.8°C), దిమా వత్తాయీన్ (42.4°C), మరియు అల్ ముధైబి (42.3°C) సహా పలు ఇతర ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వారం చివర్లో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°Cకి చేరవచ్చని తెలిపింది. ఎండలు అధికంగా నమోదువుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. తగినంత నీరు తాగాలని, వేడి సంబంధిత అనారోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు, అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) సంభవించవచ్చని డాక్టర్లు హెచ్చరించారు. తగినంత నీరు త్రాగాలని మరియు ఎక్కువసేపు ఎండలో ఉండవద్దన్నారు. వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో అధిక సమయం గడిపితే.. అధిక చెమట, తలనొప్పి, కళ్లు తిరగడం, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, చివరికి స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలకు దారితీయవచ్చని డాక్టర్లు హెచ్చరించారు. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేరాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









