కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- April 28, 2026
కువైట్: ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కువైట్ బేలో ఎంటర్ టైన్ మెంట్, చేపల వేట అనుమతులను నిలిపివేస్తున్నట్లు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థ (EPA) తెలిపింది. కాగా, ఇటువంటి కార్యకలాపాలను అనుమతించే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు బే వెలుపల నిర్దేశిత ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని EPA ప్రజా సంబంధాల డైరెక్టర్ షేఖా అల్-ఇబ్రహీం స్పష్టం చేశారు.
సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. పౌరులు, నివాసితులు అధికారిక సూచనలను పాటించాలని, కార్యకలాపాలను అనుమతించబడిన ప్రాంతాలకే పరిమితం చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







