కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- April 28, 2026
కువైట్: ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కువైట్ బేలో ఎంటర్ టైన్ మెంట్, చేపల వేట అనుమతులను నిలిపివేస్తున్నట్లు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థ (EPA) తెలిపింది. కాగా, ఇటువంటి కార్యకలాపాలను అనుమతించే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు బే వెలుపల నిర్దేశిత ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని EPA ప్రజా సంబంధాల డైరెక్టర్ షేఖా అల్-ఇబ్రహీం స్పష్టం చేశారు.
సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. పౌరులు, నివాసితులు అధికారిక సూచనలను పాటించాలని, కార్యకలాపాలను అనుమతించబడిన ప్రాంతాలకే పరిమితం చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







